Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి చేసిన అప్పులు కూడా చెల్లించాల్సిందే : మద్రాస్ హైకోర్టు

తండ్రి మరణానంతరం ఆయన సంపాదించిన ఆస్తులు పంచుకోవడమే కాకుడా, ఆయన చేసిన అప్పులు కూడా వారసులు చెల్లించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

తండ్రి చేసిన అప్పులు కూడా చెల్లించాల్సిందే : మద్రాస్ హైకోర్టు
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:32 IST)
తండ్రి మరణానంతరం ఆయన సంపాదించిన ఆస్తులు పంచుకోవడమే కాకుడా, ఆయన చేసిన అప్పులు కూడా వారసులు చెల్లించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, తండ్రి మరణానంతరం సంక్రమించే ఆస్తులతో పాటు తన అప్పులను కూడా వారసులు తీర్చాలని స్పష్టం చేసింది. తన తండ్రి నివాసంలో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించని నష్టపరిహారాన్ని ఆయన తనయుడు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. 
 
తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ..."మన పురాణ ధర్మశాస్త్రాల్లో నైతిక బాధ్యతల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారం, రుణం చెల్లించకపోవడం పాపం కిందకు వస్తుంది. అది పై లోకంలో తీవ్ర నరకానికి గురిచేస్తుంది. రాముడి తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో పిటిషనర్‌కి బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది" అని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ డిమాండ్ల సాధన కోసం పార్టీలన్నీ ఏకమవ్వాలి : రాహుల్ గాంధీ