Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూత్తుకుడి రక్తసిక్తం.. రేయ్.. ఒక్కడైనా చావాలి.. ఖాకీల కామెంట్స్ (Video)

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగవారంతో వంద రోజులు పూర్తి

తూత్తుకుడి రక్తసిక్తం.. రేయ్.. ఒక్కడైనా చావాలి.. ఖాకీల కామెంట్స్ (Video)
, బుధవారం, 23 మే 2018 (09:52 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగళవారంతో వంద రోజులు పూర్తిచేసుకుంది. దీన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీ, నిరసనలు ఉద్ధృతమై ఘర్షణ వాతావరణనానికి దారితీసింది. దీంతో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు. ఆపై జరిగిన పరిణామాల్లో మరికొందరు గాయపడ్డారు.
 
కలెక్టరేట్‌ను ధ్వంసం చేశారు. వందలాది సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. స్టెరిలైట్ ఉద్యోగులు నివశించే భవన సముదాయానికి నిప్పు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం కలిగిస్తోంది. 
 
ఈ వీడియోలో తుపాకులతో కాల్చాలని కనీసం ఒక్కరన్నా చావాల్సిందేనని ఓ పోలీసు అంటున్న గొంతు వినిపిస్తోంది. 'కనీసం ఒక్కరైనా చనిపోవాల్సిందే' అంటున్న పోలీసు, ఆపై బుల్లెట్ ఫైరింగ్ శబ్దం వినిపిస్తోంది. అయితే, సదరు పోలీసు కాల్చిన బుల్లెట్ కారణంగా ఎవరైనా చనిపోయారా? లేదా? అనే విషయమై స్పష్టతలేదు. ఆ వీడియోను జాతీయ వార్తా సంస్థ 'ఏఎన్ఐ' బయటపెట్టింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి మరణించిన హోటల్ దావూద్‌దే.. దీని వెనక కచ్చితంగా ఏదో జరిగివుంటుంది?