Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (13:24 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు కోసం ఓ యువతి దేశ సరిహద్దులను దాటి వచ్చింది. తన ప్రియుడు ఉన్న చోటికి వచ్చిన ఆ యువతి ఏకంగా అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులు గమనించి పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్‌వార్ ప్రాంతానికి చెందిన రిషేవి అనే యువతి జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయమయ్యాడు. 
 
ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై రిషేవి చెన్నైకి వచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని కలుసుకుని, అతనితోనే ఉండసాగింది. ఈ విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. 
 
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్‌నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments