Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (13:24 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు కోసం ఓ యువతి దేశ సరిహద్దులను దాటి వచ్చింది. తన ప్రియుడు ఉన్న చోటికి వచ్చిన ఆ యువతి ఏకంగా అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులు గమనించి పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్‌వార్ ప్రాంతానికి చెందిన రిషేవి అనే యువతి జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయమయ్యాడు. 
 
ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై రిషేవి చెన్నైకి వచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని కలుసుకుని, అతనితోనే ఉండసాగింది. ఈ విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. 
 
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్‌నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments