తమిళనాడు (తెలుగు) మంత్రి కె.బాలకృష్ణా రెడ్డికి మూడేళ్ల జైలు

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (17:16 IST)
తమిళనాడు రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈయన హోసూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన తెలుగు మంత్రి. ఇంతకీ ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష ఎందుకు పడిందో తెలుసా...? బస్సులపై రాళ్ళు విసిరి ధ్వంసం చేసిన కేసులో ఆయనకు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 
 
గతంలో కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని భాగనూరులో (కర్ణాటక సరిహద్దు ప్రాంతం) కల్తీసారాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఇందులో బాలకృష్ణా రెడ్డితో పాటు.. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులు రాళ్లురువ్వి బస్సులను ధ్వంసం చేశారు. 
 
ఈ కేసు విచారణ కృష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తిగా, సోమవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు మంత్రి బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments