Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు (తెలుగు) మంత్రి కె.బాలకృష్ణా రెడ్డికి మూడేళ్ల జైలు

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (17:16 IST)
తమిళనాడు రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈయన హోసూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన తెలుగు మంత్రి. ఇంతకీ ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష ఎందుకు పడిందో తెలుసా...? బస్సులపై రాళ్ళు విసిరి ధ్వంసం చేసిన కేసులో ఆయనకు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 
 
గతంలో కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని భాగనూరులో (కర్ణాటక సరిహద్దు ప్రాంతం) కల్తీసారాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఇందులో బాలకృష్ణా రెడ్డితో పాటు.. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులు రాళ్లురువ్వి బస్సులను ధ్వంసం చేశారు. 
 
ఈ కేసు విచారణ కృష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తిగా, సోమవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు మంత్రి బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments