Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 31న కేరళను తాకనున్నాయ్!

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (12:42 IST)
నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరిస్తున్నాయి. పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్‌ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు.. ఒకరోజు ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి. 
 
సాధారణంగా మే 22న రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి వస్తాయి. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే రావడంతో కేరళకు కూడా ఒకరోజు ముందే చేరుకుంటున్నాయి. రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి.
 
ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో గత వారమే వర్షాలు ప్రారంభమవగా.. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. 
 
బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు వస్తుండగా ఈ నెల 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments