Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం : మాయావతి ఫైర్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:38 IST)
తమ ఎమ్మెల్యేలను లాక్కున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్‌కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

మాయావతి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించి బీఎస్పీ గతంలోనే కోర్టును ఆశ్రయించిందని, అయితే కాంగ్రెస్‌ పార్టీకి, సిఎం గెహ్లాట్‌కు బుద్ధి చెప్పేందుకు తాము సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న అంశాన్ని ఇప్పుడు అంత తేలికగా వదిలేయబోమని, సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు.

గెహ్లాట్‌ తప్పులు కాంగ్రెస్‌ నేతలకు కనిపించవని, బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్‌కు తాము మద్దతు ప్రకటించామని, అయితే రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments