Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 నెలలుగా సహజీవనం... గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (07:13 IST)
ఎనిమిది నెలలుగా సహజీవనం చేసి గర్భవతిని చేసిన తన ప్రియురాలిపై ఓ ప్రియుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ గర్భిణి ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని సోనీపట్‌ జిల్లాకు చెందిన ప్రగతి, రాహుల్ అనే ఇద్దరు యువతీయువకులు కుండ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూవస్తున్నారు. 
 
ప్రగతి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాహుల్.. తన ప్రియురాలు ప్రగతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రగతి చావుబతుకుల మధ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments