Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 నెలలుగా సహజీవనం... గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (07:13 IST)
ఎనిమిది నెలలుగా సహజీవనం చేసి గర్భవతిని చేసిన తన ప్రియురాలిపై ఓ ప్రియుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ గర్భిణి ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని సోనీపట్‌ జిల్లాకు చెందిన ప్రగతి, రాహుల్ అనే ఇద్దరు యువతీయువకులు కుండ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూవస్తున్నారు. 
 
ప్రగతి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాహుల్.. తన ప్రియురాలు ప్రగతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రగతి చావుబతుకుల మధ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments