Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌ బైపోల్.. ప్రియాంకకు మద్దతుగా సోనియా గాంధీ

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (12:40 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పేరును ప్రకటించారు. 
 
అదేసమయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పేరును ఖరారు చేశారు. ఈమె కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా విభాగం ప్రధాన కార్యదర్శిగా నవ్య కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప పోరుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ తరపున కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తర్వాత రెండు మూడు దఫాలుగా సోనియా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సోనియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఏఐసీసీ ఖరారు చేయనుంది. 
 
మరోవైపు, బీజేపీ బరిలో నిలిపిన నవ్య హరిదాస్ ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నట్టు ఆమె సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా తెలుస్తుంది. పార్టీ డైనమిక్ లీడర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. 2007లో బీటెక్ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments