అదనపు కట్నం కోసం అత్త ముక్కును కొరికిన అల్లుడు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ అల్లుడు అత్త ముక్కును కొరికేశాడు. అలాగే, ఆయన తండ్రి ఆమె చెవిని కొరికేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బరేలీకి చెందిన రెహ్మాన్‌, గుల్షాన్‌ దంపతుల కుమార్తె చాంద్‌ బీకి ప్రాపర్టీ డీలర్‌ అయిన మహ్మద్‌ ఆష్ఫక్‌తో ఒక యేడాది క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద మహ్మద్‌కు రూ.10 లక్షలు ఇచ్చారు. 
 
ఒక యేడాది లోపే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులు అదనంగా మరో రూ.5 లక్షలు తేవాలని చాంద్‌ బీని డిమాండ్‌ చేశారు. ఇందుకు రెహ్మాన్‌ అంగీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో తన భార్య చాంద్ బీని తీసుకుని మహ్మద్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అదనపు కట్నం విషయంపై వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్ అత్త గుల్షాన్‌ ముక్కును కొరికేశాడు. ఆమె చెవిని మహ్మద్ తండ్రి కొరకడమే కాకుండా, కత్తితో కత్తిరించాడు. 
 
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ లోపే మహ్మద్‌, అతని తండ్రి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments