Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు.. వారానికోసారి బిస్కెట్లు తెచ్చి..?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:29 IST)
కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు. ఇంట్లో పెట్టి తాళాలు వేసి బిస్కెట్లు ఆకలికి విసిరేసి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (62)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. ఆస్తుల కోసం అన్నాదమ్ములు విడిపోయారు. ఇందులో భాగంగా తల్లిని పట్టించుకోలేదు. పదేళ్ల క్రితం ఓ ఇంట్లో బంధించారు. 
 
వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఆమెను కాపాడటం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments