Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు.. వారానికోసారి బిస్కెట్లు తెచ్చి..?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:29 IST)
కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు. ఇంట్లో పెట్టి తాళాలు వేసి బిస్కెట్లు ఆకలికి విసిరేసి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (62)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. ఆస్తుల కోసం అన్నాదమ్ములు విడిపోయారు. ఇందులో భాగంగా తల్లిని పట్టించుకోలేదు. పదేళ్ల క్రితం ఓ ఇంట్లో బంధించారు. 
 
వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఆమెను కాపాడటం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments