పశువుల పాకలో సేదతీరుతున్న కొడాలి నాని

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:11 IST)
మొన్నటివరకు రాష్ట్ర మంత్రిగా పెత్తనం చెలాయించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇపుడు పశువుల పాకలో సేద తీరుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రిపదవి దక్కలేదు. దీంతో ఆయన ఇపుడు తన ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. 
 
అయితే, కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ ఆయనకు కేబినెట్ హోదాతో ఛైర్మన్ పోస్టును ఇవ్వనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యంగా, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించనున్నారు. 
 
మరోవైపు, మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. కేవలం తన ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి పదవి తనకు అక్కర్లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంత కృషి చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. కానీ, ఆయన మాత్రం పెద్దగా యాక్టివ్‌గా కనిపించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments