Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజాపూర్‌ జిల్లా దర్బాలో మావోల మెరుపుదాడి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:02 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా దర్బా ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పోలీసు క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. 
 
ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్టు ఆయన వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని బీజాపూర్ జిల్లా దవాఖానాలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, పోలీస్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments