Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ జలప్రళయంలో 37మంది ఏపీ ప్రయాణీకుల గల్లంతు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:28 IST)
జమ్మూకాశ్మీర్ అమర్ నాథ్ జలప్రళయంలో ఏపీకి చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించలేదు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితోపాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమండ్రికిచెందిన ఇద్దరు మహిళల సహా 37 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
అమర్‌నాథ్‌ యాత్రలో వరదల తర్వాత పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వారి అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు.. తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆచూకీ లభించని వారి విషయంలో మాత్రం ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.
 
అమర్‌నాథ్‌‌లో గల్లంతైన ఏపీ వాసుల సమాచారాన్ని.. ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్న ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్‌కు అందజేశారు. ఆయన అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఏపీ వాసుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం, ఫోన్ చార్జింగ్ అయిపోవడం వంటి కారణాల వల్ల సరైన సమాచారం అందడం లేదని, తద్వారా గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments