Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారాం ఏచూరీకి మాతృవియోగం - అనారోగ్యంతో మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (12:26 IST)
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్పకం మృతి చెందారు. 
 
కాగా కల్పకం మృతి పట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సీపీఎం తెలిపింది. 
 
కల్పకం ఏచూరి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌కు కల్పకం అభిమాని మాత్రమే కాకుండా ఆమె బాటను జీవితాంతం అనుసరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments