Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారాం ఏచూరీకి మాతృవియోగం - అనారోగ్యంతో మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (12:26 IST)
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్పకం మృతి చెందారు. 
 
కాగా కల్పకం మృతి పట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సీపీఎం తెలిపింది. 
 
కల్పకం ఏచూరి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌కు కల్పకం అభిమాని మాత్రమే కాకుండా ఆమె బాటను జీవితాంతం అనుసరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments