Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు వేల పెన్షన్ కోసం.. కన్నతల్లినే కడతేర్చాడు.. ఎక్కడ?

రెండు వేల పెన్షన్ కోసం.. కన్నతల్లినే కడతేర్చాడు.. ఎక్కడ?
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (15:47 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు కోసం ఎంత నేరాలనైనా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా కన్నతల్లికి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు పెన్షన్ డబ్బుకు కక్కుర్తిపడ్డాడు. అంతే కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. తల్లిని కన్నకొడుకే అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు వెల్లడించారు. 
 
తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను నిత్యం వేధించేవాడని చెప్పారు. శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పెన్షన్ డబ్బు రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పెన్షన్ డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్సర్‌తో మహిళా హక్కుల ఉద్యమ మహిళా నేత మృతి