Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో అసమర్థ నాయకత్వం.. అందుకే ప్రధాని మోడీ పర్యటన : శివసేన

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో అసమర్థ నాయకత్వం ఉందనీ అందుకే ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారని శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. తౌక్టే తుఫాను దెబ్బకు కేరళ, కర్నాటక, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. 
 
ఈ నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ కేవ‌లం గుజ‌రాత్‌లోనే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అలాగే తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. దీనిపై శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది. గుజ‌రాత్ రాష్ట్రంలో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అస‌మ‌ర్థ నాయ‌క‌త్వం ఉన్నందువల్లే ప్ర‌ధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నార‌న్నారు. 
 
మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా ధీటుగా ఎదుర్కోగ‌ల‌ర‌ని, ప్ర‌ధానికి కూడా ఈ విష‌యం తెలుసున‌ని రౌత్ పేర్కొన్నారు. మ‌రోవైపు సేన ఎంపీ విమర్శ‌ల‌ను కాషాయ పార్టీ తోసిపుచ్చింది. ప్ర‌ధాని మోడీపై దాడి చేసే బదులు మ‌హారాష్ట్ర మంత్రులు ఎసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని బీజేపీ నేత రామ్ క‌ద‌మ్ హిత‌వు ప‌లికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments