Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి వెళ్లిన శివసేన ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 12 మే 2022 (17:21 IST)
MLA
కుటుంబంతో విహార యాత్ర కోసం దుబాయ్‌కి వెళ్లిన ముంబైకి చెందిన ఓ శివసేన ఎమ్మెల్యే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లక్టే అక్కడ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
 
ఆయన వయసు 52 ఏళ్లు. ఎమ్మెల్యే రమేశ్ భౌతికదేహాన్ని గురువారం ముంబై తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. ముంబైలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన బీఎంసీ కార్పొరేటర్‌గా కూడా చేశారు. 
 
కాంగ్రెస్‌కు చెందిన సురేష్ శెట్టిని ఓడించి, 2014లో అంధేరీ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం పటేల్‌ను ఓడించారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ మృతి పట్ల శివసేన నేతలు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments