Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి శశిథరూర్‌ ప్రశంస.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:36 IST)
కాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడిని ప్రధాని మోడీ ఖండిస్తూ ...ఆందోళన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రశంసించారు. క్యాపిటల్‌ భవనంలో సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచ దేశాల నేతలు ఖండించగా.. అందులో ప్రధాని మోడీ కూడా ఉన్నారు.

గతంలో పెద్దన్న భజన చేసి...ట్రంప్‌ను పొగడ్తలతో ముంచిన మోడీ.. ప్రస్తుత ఆయన వైఖరి పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా అధికార బదిలీ చేయాలని, చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడాన్ని ఉపేక్షించమని మోడీ ట్వీట్‌ చేశారు.

దీనిపై శశిథరూర్‌ స్పందిస్తూ..డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనకు భారత్‌ దూరం అవుతుందనడానికి మంచి సంకేతం అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నుకోబడిన బైడెన్‌ పరిపాలనతో పనిచేయాలని సూచించారు.

ఈ వ్యాఖ్యలు వల్ల అమెరికాతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ఏవైనా సమస్యలు వస్తాయని తాను విశ్వసించనని, ప్రధాని ఆందోళన వ్యక్తం చేయడం శుభ సూచికమని అన్నారు. ట్రంప్‌కు తాను, తమ ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments