Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో జయ, కరుణ.. ఇద్దరూ కలిసిపోయారు..

తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:22 IST)
తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీరిద్దరూ నువ్వా నేనా అంటూ రాజకీయాల్లో పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు రాణించేందుకు సంసిద్ధమయ్యేవారు. కానీ చివరికి ఈ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం కలిసిపోయారు. కానీ ఇది యాదృచ్చికంగా జరిగిపోయింది. 
 
అదేంటంటే.. తమిళనాడుకు దశాబ్దాల పాటు సేవలందించిన జయలలిత, కరుణానిధిలు పాల్గొన్న చివరి కార్యక్రమాలు ఒకే నెలలో జరిగాయి. 2016లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న జయలలిత సెప్టెంబర్ 21న చెన్నైలో జరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లిటిల్ మౌంట్ నుంచి విమానాశ్రయం వరకూ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఆపై ఆమె బయట మరెక్కడా కనిపించలేదు. చివరికి డిసెంబర్ 5వ తేదీ 2016లో ఆమె అపోలోలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా బయట చివరిసారిగా కనిపించింది అదే సంవత్సరం అదే నెల కావడం గమనార్హం. 2016 సెప్టెంబర్ 17న చెన్నైలోని అన్నా అరివాలయంలో ''డీఎంకే ముప్పెరుం విళా'' జరుగగా, కరుణానిధి పాల్గొని తన సహజత్వానికి భిన్నంగా భావోద్వేగంతో ప్రసంగించారు. తాను పాల్గొనే చివరి వేడుక ఇదేనని చెప్పారు. ఆ మరుసటిరోజు అక్కడే జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశమైన ఆయన, ఆపై ఇంటికే పరిమితం అయ్యారు. వీరిద్దరూ 2016 సెప్టెంబర్ తరువాత బయటి ప్రపంచంలోకి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments