Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్యను ఒప్పించడం చాలా కష్టం. కొంతమంది సర్దుకుపోతారు కానీ మరికొంతమంది పూర్తిగా విడిపోతుంటార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:07 IST)
ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్యను ఒప్పించడం చాలా కష్టం. కొంతమంది సర్దుకుపోతారు కానీ మరికొంతమంది పూర్తిగా విడిపోతుంటారు. ఇదంతా జరిగే కథే. అందరికీ తెలిసిందే. ఇక్కడ చెప్పబోయేది మాత్రం చదివితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 
 
ఉత్తర బెంగుళూరులోని కళ్యాణ్‌ నగర్‌లో సెకండ్ వైఫ్‌ అనే ఒక రెస్టారెంట్‌ను కొత్తగా ఏర్పాటుచేశారు. అదే వీధిలో ఆంధ్ర నుంచి ఒక నూతన దంపతులు కాపురం చేరారు. కొత్తగా పెళ్ళవ్వడంతో భర్తతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్ళాలనుకుంది భార్య. భార్య శిరీష తన భర్త రాజును రెస్టారెంట్‌కు తీసుకెళ్ళమని కోరింది. దీంతో వెంటనే భర్త సెకండ్ వైఫ్‌ హోటల్‌కు వెళదామంటూ చెప్పాడు. దీంతో ఆ భార్యకు చిర్రెత్తుకొచ్చిందట. 
 
సెకండ్ వైఫ్‌ హోటల్ ఏంటి అంటూ అంతెత్తు లేచి పడిందట. అసలు విషయం చెప్పేలోపే శిరీషకు కోపంతో ఊగిపోయిందట. రాజు వెంటనే నీకు దణ్ణం పెడతా సెకండ్ వైఫ్‌ అనేది రెస్టారెంట్ పేరు. ఆంధ్రా రుచులతో అక్కడి వారు ఇక్కడ కొత్తగా రెస్టారెంట్ పెట్టారు అని చెప్పారట. అయినా సరే భార్య నమ్మకపోవడంతో ఆ రెస్టారెంట్‍కు వెళ్ళి చూపించాడట. అప్పుడు శిరీషకు అర్థమైందట. ఇలా చాలామంది సెకండ్ వైఫ్‌ రెస్టారెంట్ పేరు చెప్పి వారి సతీమణుల దగ్గర అడ్డంగా బుక్కయిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments