Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త వద్దు... ప్రియుడే ముద్దు : భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య నాటకం

ఇటీవలి కాలంలో ప్రియుళ్ళ మోజులో పడిన భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతోంది. ఇప్పటికే ఓ స్వాతి, ఓ జ్యోతి, ఓ శ్రీవిద్య ఇలా పలువురు ఈ కోవలో ఉన్నారు.

Advertiesment
Bangalore Cop
, మంగళవారం, 9 జనవరి 2018 (08:51 IST)
ఇటీవలి కాలంలో ప్రియుళ్ళ మోజులో పడిన భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతోంది. ఇప్పటికే ఓ స్వాతి, ఓ జ్యోతి, ఓ శ్రీవిద్య ఇలా పలువురు ఈ కోవలో ఉన్నారు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడి కోసం భర్తను దూరం చేసుకునేందుకు కాస్త వెరైటీగా సరికొత్త నాటకం ఆడి పోలీసులకు దొరికిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు పరిధిలోని బ్యాటరాయనపురానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 6వ తేదీన పోలీసు స్టేషన్‌కు ఏడుస్తూ వచ్చింది. మూడు నెలల క్రితమే తనకు పెళ్లయిందని, తాను రోడ్డుపై వెళుతుంటే, ఓ కారు ఆపి చిరునామా అడుగుతున్నట్టు నటించి, కారులోకి లాగేశారని, నోరు మూసి, రోజంతా తనను తిప్పుతూ, కారులోనే నలుగురూ తనపై పశువుల్లా పడి అత్యాచారం చేశారని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
ఇక తాను ఇంటికి ఎలా వెళ్లాలని, భర్తతో ఎలా కాపురం చేయాలని వలవలా ఏడ్చింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపగా, ఆమె నెల రోజుల నుంచి అసలు సెక్స్‌లో పాల్గొనలేదన్న తేల్చారు. 
 
ఆపై ఆమె కిడ్నాప్‌కు గురైనట్టు చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే, ఆమె ఎక్కడా కనిపించ లేదు. దీంతో కాస్తంత గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది. తనకు భర్తంటే ఇష్టం లేదని, పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని చెబితే భర్త వదిలేస్తాడన్న ఆలోచనతో ఈ నాటకం ఆడినట్టు చెప్పడంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. భర్తకు విషయం చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్ రోగ్స్... 19 ఏళ్ల యువతిని చంపేశారు... ఆమె అవయవాలు ఇద్దామన్నా...