Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా సచిన్...?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:35 IST)
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ శుక్రవారంనాడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా సచిన్‌తో సమావేశమయ్యారు. గాంధీలను సచిన్ కలుసుకోవడం వారంలో ఇది రెండోసారి.

సుమారు 45 నిమిషాల పాటు సచిన్, గాంధీల మధ్య సమావేశం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో నాయకత్వ మార్పును పైలట్ ఆశిస్తున్నప్పటికీ, ఆ యోచనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని రాహుల్, ప్రియాంక భావిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా, గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారానికి 44 ఏళ్ల సచిన్ పైలట్ అంగీకరించారా లేదా అనేది వెంటనే తెలియలేదు. రాజస్థాన్ క్యాబినెట్‌లో తన విధేయులకు చోటు కల్పించాలని పైలట్ పట్టుదలగా ఉన్నారు. గాంధీలతో జరిపిన సమావేశంలో ఈ అంశం చర్చించి ఉండొచ్చని అంటున్నారు.

గత ఏడాది జూన్ వరకూ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్ ఆ పదవికి రాజీనామా చేయడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను బుజ్జగించింది. పైలట్‌కు పార్టీ అధిష్టానం చేసిన వాగ్దానం ప్రకారం క్యాబినెట్‌లో మార్పులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ మీనమేషాలు లెక్కపెడుతుండటంతో గాంధీలను పైలట్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments