Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో సోమవారం నుంచి భక్తులకు దర్శనం భాగ్యం

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:23 IST)
కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది. సోమవారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. శబరిమలలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్‌కోర్ బోర్డు గైడ్ లెైన్స్ విడుదల చేసింది. 
 
వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. వారంలో ఐదు రోజులపాటు ప్రతి రోజూ వెయ్యి మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం రెండు వేల మందిని చొప్పున భక్తుల్ని అనుమతిస్తున్నారు.
 
కరోనా వైరస్ నేపథ్యంలో దర్శనాలపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రోజుకు వేయి మంది చొప్పున, శనివారం, ఆదివారంలో రెండు వేల మంది చొప్పున భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకుంటేనే లోపలికి అనుమతిస్తామని వెల్లడించింది. 
 
ఈ మేరకు పంపాకు చేరుకునే రహదారిలో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంపా నదిలో స్నానాలపై నిషేదం విధించారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి, పదేళ్ల లోపు పిల్లలకు శబరిమలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments