Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలకు 20 రోజుల్లోనే రికార్డ్​ స్థాయి ఆదాయం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (08:18 IST)
శబరిమల యాత్ర ప్రారంభమైన తొలి 20 రోజుల్లోనే అయ్యప్పకు రికార్డు స్థాయిలో రూ.69.39 కోట్ల ఆదాయం దక్కింది. మరో 60 రోజులపాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఆదాయం రికార్డు స్థాయిని దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఆలయ ఆదాయమూ అదే స్థాయిలో పెరుగుతోంది. మొదటి 20 రోజుల్లోనే రూ. 69 కోట్లు దాటింది. మరో 60 రోజుల పాటు శబరిమలను దర్శించుకునేందుకు అయ్యప్ప భక్తులు రానున్నారు. మొదటి 20 రోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

ఇది గతేడాదితో పోలిస్తే రూ. 27.55 కోట్లు ఎక్కువ. అరవణ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 28.26 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా రూ. 4.2 కోట్లు, హుండీ ద్వారా రూ. 23.58 కోట్ల రూపాయలు లభించినట్లు బోర్డు తెలిపింది. అయితే గతేడాది ఇదే సమయానికి దేవస్థానానికి భక్తుల కానుకల రూపంలో చేరిన ఆదాయం రూ. 41.84 కోట్లుగా బోర్డు పేర్కొంది.

మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. ఆ కారణంగానే కిందటి ఏడాది ఆదాయం తగ్గినట్లు ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments