Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలకు 20 రోజుల్లోనే రికార్డ్​ స్థాయి ఆదాయం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (08:18 IST)
శబరిమల యాత్ర ప్రారంభమైన తొలి 20 రోజుల్లోనే అయ్యప్పకు రికార్డు స్థాయిలో రూ.69.39 కోట్ల ఆదాయం దక్కింది. మరో 60 రోజులపాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఆదాయం రికార్డు స్థాయిని దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఆలయ ఆదాయమూ అదే స్థాయిలో పెరుగుతోంది. మొదటి 20 రోజుల్లోనే రూ. 69 కోట్లు దాటింది. మరో 60 రోజుల పాటు శబరిమలను దర్శించుకునేందుకు అయ్యప్ప భక్తులు రానున్నారు. మొదటి 20 రోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

ఇది గతేడాదితో పోలిస్తే రూ. 27.55 కోట్లు ఎక్కువ. అరవణ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 28.26 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా రూ. 4.2 కోట్లు, హుండీ ద్వారా రూ. 23.58 కోట్ల రూపాయలు లభించినట్లు బోర్డు తెలిపింది. అయితే గతేడాది ఇదే సమయానికి దేవస్థానానికి భక్తుల కానుకల రూపంలో చేరిన ఆదాయం రూ. 41.84 కోట్లుగా బోర్డు పేర్కొంది.

మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. ఆ కారణంగానే కిందటి ఏడాది ఆదాయం తగ్గినట్లు ఆలయ ధర్మకర్తలు వెల్లడించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments