ప్రారంభానికి ముందే కూలిపోయింది.. రూ.389 కోట్లు నీటిపాలు

ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్‌ పంథ్‌ కెనాల్‌ ప్రాజెక్టు ప్రారంభిం

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:06 IST)
ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్‌ పంథ్‌ కెనాల్‌ ప్రాజెక్టు ప్రారంభించడానికి 24 గంటల ముందే అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
కెనాల్‌లోకి భారీగా నీరు రావడంతో అక్కడ నిర్మించిన గోడ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టును బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ ప్రమాదం కారణంగా ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కెనాల్‌ గోడ కూలిపోవడంతో నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.
 
బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల రైతులకు నీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. పనులు పూర్తికావడంతో ప్రయోగాత్మకంగా నీటిని నింపారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు వద్ద నిర్మించిన గోడ కొట్టుకుపోయింది. 
 
ఖహలగాన్‌, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. అక్కడ మునిగిపోయిన ఇళ్లలో ఖహల్‌గాన్‌ సివిల్‌ జడ్జి, సబ్‌జడ్జి నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments