Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై : టైల్స్ కంపెనీలో రూ.200 కోట్ల నల్లధనం ... ఎవరిదన్న కోణంలో ఆరా?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:53 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అదేసమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే, నగదు రవాణా అడ్డుకునేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను కూడా ఈసీ నియమించింది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరంలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. ఓ ప్రముఖ టైల్స్‌ అండ్‌ శానిటరీవేర్‌ తయారీ కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బు వెలుగుచూసింది. 
 
ఫిబ్రవరి 26వ తేదీన జరిపిన సోదాల్లో మొదట రూ.8.30 కోట్లు సీజ్‌ చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ అధికారులు తెలిపారు. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకోసం ఓ రహస్య ఆఫీసుతో పాటు, ఓ సాఫ్ట్‌వేర్‌ను సైతం ఉపయోగించినట్లు కనుగొన్నారు.
 
యాభై శాతానికి పైగా లావాదేవీలు రికార్డు చేయలేదని తెలిపారు. మొత్తం 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బును గుర్తించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఈ డబ్బును ఉపయోగించాలనుకున్నారా అన్న దానిపై విచారణ చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments