Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్... ఏంటంటే...

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (17:22 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారంతో పోల్చితే గురువారం ప్రణబ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని పేర్కొంది. ముఖ్యంగా, 84 యేళ్ళ ప్రణబ్ శరరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఫలితంగా ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. 
 
అయినప్పటికీ ఆయన వెంటిలేటర్‌పైనే ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రణబ్‌ ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూచీలను స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ ఆస్పత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, తొలుత కరోనా వైరస్ బారినపడిన ప్రణబ్‌ను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూరాగా, ఆయనకు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఓ క్లాట్ ఏర్పడినట్టు గుర్తించి, సర్జరీ చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆయనకు వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఆయన కోమాలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కానీ, గురువారం మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం కాస్త కుదుటపడినట్టు వైద్యులు వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments