Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు బై బై... హార్లే డేవిడ్‌సన్ బైక్ కార్యకలాపాలు నిలిపివేత!

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (17:09 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోటార్ సైకిల్ సంస్థ హార్లే డేవిడ్‌సన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఆశించిన స్థాయిలో ప్రజాధారణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీనికతోడు భారత్‌లోని ఇతర మోటార్ కంపెనీల నుంచి ఎదరవుతున్న పోటీని ధీటుగా ఎదుర్కోలేక పోయింది. ఫలితంగానే హార్లే డేవిడ్‌సన్ బైకుల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికితోడు కరోనా కష్టకాలం కూడా మరో కారణంగా నిలిచింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం అంతంతమాత్రంగానే ఉందన్నారు. భారత్‌లో లాభదాయకతకు పెట్టుబడుల విలువకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఒక్క ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ విపణిలో సైతం తన ఉనికిని గురించి హార్లే డేవిడ్‌సన్ పరిశీలిస్తోంది అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, గతయేడాది భారత్‌లో కేవలం 2,500 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయనీ, ఇక ఏప్రిల్-జూన్ మధ్య కేవలం 100 బైక్‌లు మాత్రమే అమ్ముడుపోయానని హార్లే డేవిడ్‌సన్ ప్రకటించింది. అయితే అమెరికా, యూరప్‌, పసిఫిక్ ఆసియాలలో కొత్త మార్కెట్‌లను సృష్టించుకునేందుకు హార్లే ప్రయత్నాలు ప్రారంభించిందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments