Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు : దేశ చరిత్రలో తొలిసారి ఎట్ హోం రద్దు

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:58 IST)
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే, ఈ దఫా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం వేడుకను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి. 
 
సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నాతధికారులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు రెండు వేల మందికి రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. 
 
అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతి రోజూ 2.50 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలోనైనా ఈ వేడుకలను నిర్వహించాలని భావించారు. 
 
కానీ, అదీకూడా సాధ్యంకాలేదు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎట్ హోం కార్యక్రమం రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments