Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు : దేశ చరిత్రలో తొలిసారి ఎట్ హోం రద్దు

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:58 IST)
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే, ఈ దఫా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం వేడుకను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ మహమ్మారి. 
 
సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నాతధికారులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సుమారు రెండు వేల మందికి రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. 
 
అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతి రోజూ 2.50 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలోనైనా ఈ వేడుకలను నిర్వహించాలని భావించారు. 
 
కానీ, అదీకూడా సాధ్యంకాలేదు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ సింగ్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎట్ హోం కార్యక్రమం రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments