Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (17:01 IST)
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కుల సర్టిఫికెట్ విషయంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కాగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి మోసగించారనే ఆరోపణతో ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఆమెకు రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. ముంబై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎంపీ నవనీత్ కౌర్.
 
జస్టిస్‌ వినీత్‌ సరన్‌, దినేష్‌ మహేశ్వరిల వేకేషన్‌ బెంచ్‌ నవనీత్‌ కౌర్‌ పిటిషన్‌పై విచారణ జరిపి మంగళవారం స్టే విధించింది. ఇక కులధ్రువీకరణ పత్రం వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు మరికొందరికి నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు. కాగా నవనీత్ కౌర్ అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments