Webdunia - Bharat's app for daily news and videos

Install App

తివారీ డ్యామ్‌కు గండి పడింది పీతల వల్లేనట!

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:07 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా తివారీ ఆనకట్టకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ గండి కారణంగా డ్యామ్‌లోని నీళ్లు క్రింద వైపు ఉన్న ప్రాంతం మొత్తాన్ని ముంచివేయడం జరిగింది. డ్యామ్ కింద వైపు ఉన్న 12 నివాసాలు కొట్టుకుపోయి... 23 మంది గల్లంతు కాగా... ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
కాగా... ఆనకట్టకు గండిపడటంపై మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని... వాటి వల్లే ఆనకట్టకు లీకేజీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంతకు ముందు లీకేజీలు లేవని... డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించిన ఆయన... ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 
 
అయితే అధికారులు దీనికి సంబంధించిన పనులు కూడా చేపట్టారని... అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. అవేవో పీతలు కాబట్టి సరిపోయింది కానీ మొసళ్లు అయితే ఏమై ఉండేదో మరి మంత్రిగారికే తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments