Webdunia - Bharat's app for daily news and videos

Install App

తివారీ డ్యామ్‌కు గండి పడింది పీతల వల్లేనట!

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:07 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా తివారీ ఆనకట్టకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ గండి కారణంగా డ్యామ్‌లోని నీళ్లు క్రింద వైపు ఉన్న ప్రాంతం మొత్తాన్ని ముంచివేయడం జరిగింది. డ్యామ్ కింద వైపు ఉన్న 12 నివాసాలు కొట్టుకుపోయి... 23 మంది గల్లంతు కాగా... ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 
కాగా... ఆనకట్టకు గండిపడటంపై మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని... వాటి వల్లే ఆనకట్టకు లీకేజీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంతకు ముందు లీకేజీలు లేవని... డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించిన ఆయన... ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 
 
అయితే అధికారులు దీనికి సంబంధించిన పనులు కూడా చేపట్టారని... అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. అవేవో పీతలు కాబట్టి సరిపోయింది కానీ మొసళ్లు అయితే ఏమై ఉండేదో మరి మంత్రిగారికే తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments