Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్ష్యం చెప్పకుండా అత్యాచార బాధితురాలికి విషం తాగించారు...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (15:54 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు అత్యాచార బాధితురాలికి ఇద్దరు యువకులు విషం తాగించారు. ఢిల్లీలోని ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హస్తసాల్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ యువతి ఓ అత్యాచార కేసులో ప్రధాన సాక్షి. ఈమె గత గురువారం ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా, ఇద్దరు యువకులు అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డారు. అందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆమెతో బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. దీన్ని గమనించిన గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. 
 
శుక్రవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం కేసులో ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments