Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్ష్యం చెప్పకుండా అత్యాచార బాధితురాలికి విషం తాగించారు...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (15:54 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు అత్యాచార బాధితురాలికి ఇద్దరు యువకులు విషం తాగించారు. ఢిల్లీలోని ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హస్తసాల్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ యువతి ఓ అత్యాచార కేసులో ప్రధాన సాక్షి. ఈమె గత గురువారం ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా, ఇద్దరు యువకులు అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డారు. అందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆమెతో బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. దీన్ని గమనించిన గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. 
 
శుక్రవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం కేసులో ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments