Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్ష్యం చెప్పకుండా అత్యాచార బాధితురాలికి విషం తాగించారు...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (15:54 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు అత్యాచార బాధితురాలికి ఇద్దరు యువకులు విషం తాగించారు. ఢిల్లీలోని ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హస్తసాల్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ యువతి ఓ అత్యాచార కేసులో ప్రధాన సాక్షి. ఈమె గత గురువారం ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా, ఇద్దరు యువకులు అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డారు. అందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆమెతో బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. దీన్ని గమనించిన గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. 
 
శుక్రవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం కేసులో ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments