Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని మనిషిపై ప్రతాపం.. పనికి రాలేదని తుపాకీతో కాల్చి చంపారు...

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (12:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో పని చేసే పనిమనిషి రాలేదని ఆగ్రహించిన ఓ రిటైర్డ్ అధికారి ఆమె ఇంటికెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆమె కుమారుడిని కూడా గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రాంపూర్ పరిధి‌లోని ఛిద్దావాలా గ్రామంలో రిటైర్డ్ అధికారి సోమపాల్ సింగ్ ఇంటిలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటిపనులు చేస్తుంటుంది. అయితే ఆమె శనివారం పనిలోకి రాలేనని తెలిపింది.
 
దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అధికారి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. మధ్యలో కలగజేకున్న ఆమె కుమారునిపై దాడి చేశాడు. తర్వాత ఆమె జుట్టుపట్టకుని మెడమీద తుపాకీతో కాల్చాడు. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
దీనిపై పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడు సోమపాల్ తన ఇంటిలోపనిచేసే 35 ఏళ్ల మహిళను తుపాకీతో కాల్చి హత్య చేశారు. అడ్డుపడిన ఆమె కుమారుణ్ణి గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments