Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుమోసిన క్రిమినల్ లాయర్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్‌గా పేరుమోసి, కేంద్ర మాజీ మంత్రి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రాంజెఠ్మలానీ 70 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ, ఎన్నో వివాదాస్పద కేసులను వాదించారు.
 
తన 94 ఏళ్ల వయసు వరకూ న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. ఆయన తన 17 ఏళ్ల వయసులోనే న్యాయవాదిగా మారారు. అవిభాజ్య భారత్‌లో 1923, సెప్టెంబరు 14న పాకిస్థాన్‌లోని శికార్పుర్‌లో రామ్‌జెఠ్మలానీ జన్మించారు. అతని తండ్రి న్యాయవాది. చదువులో ఎంతో చురుకుగా ఉండే రామ్‌జెఠ్మలానీ రెండు, మూడు, నాలుగు తరగతులను ఒకే సంవత్సంలో పూర్తిచేసి, 13 ఏళ్ల వయసులోనే మెట్రిక్ పాసయ్యారు.
 
ఆ తర్వాత  ఆ తర్వాత 17 యేళ్లకే న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు 21 ఏళ్ల వయసు ఉండాలి. అయితే రాంజెఠ్మలానీ తన ప్రతిభతో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు వయసు సడలింపుపై అనుమతి పొందారు. 
 
కాగా అతని తండ్రి రామ్‌జెఠ్మలానీని లాయర్ చేయాలనుకోలేదు. మెట్రిక్ పూర్తిచేసిన రామ్‌జెఠ్మలానీని సైన్స్ కోర్సులో చదివించాలనుకున్నారు. అయితే రామ్‌జెఠ్మలానీ న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నట్లు తండ్రి ఎదుట స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments