పేరుమోసిన క్రిమినల్ లాయర్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్‌గా పేరుమోసి, కేంద్ర మాజీ మంత్రి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రాంజెఠ్మలానీ 70 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ, ఎన్నో వివాదాస్పద కేసులను వాదించారు.
 
తన 94 ఏళ్ల వయసు వరకూ న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. ఆయన తన 17 ఏళ్ల వయసులోనే న్యాయవాదిగా మారారు. అవిభాజ్య భారత్‌లో 1923, సెప్టెంబరు 14న పాకిస్థాన్‌లోని శికార్పుర్‌లో రామ్‌జెఠ్మలానీ జన్మించారు. అతని తండ్రి న్యాయవాది. చదువులో ఎంతో చురుకుగా ఉండే రామ్‌జెఠ్మలానీ రెండు, మూడు, నాలుగు తరగతులను ఒకే సంవత్సంలో పూర్తిచేసి, 13 ఏళ్ల వయసులోనే మెట్రిక్ పాసయ్యారు.
 
ఆ తర్వాత  ఆ తర్వాత 17 యేళ్లకే న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు 21 ఏళ్ల వయసు ఉండాలి. అయితే రాంజెఠ్మలానీ తన ప్రతిభతో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు వయసు సడలింపుపై అనుమతి పొందారు. 
 
కాగా అతని తండ్రి రామ్‌జెఠ్మలానీని లాయర్ చేయాలనుకోలేదు. మెట్రిక్ పూర్తిచేసిన రామ్‌జెఠ్మలానీని సైన్స్ కోర్సులో చదివించాలనుకున్నారు. అయితే రామ్‌జెఠ్మలానీ న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నట్లు తండ్రి ఎదుట స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments