Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యతో అక్రమ లింకు.. అడ్డుగా ఉందనీ భార్య హత్య

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:31 IST)
తిరుపతిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హత్య చేశాడు కిరాతక భర్త. ఈ దారుణం తిరుపతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైకి చెందిన మురుగన్-సింధియా (40)లు భార్యాభర్తలు. 20 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ క్రమంలో మురుగన్‌కు అతని స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలిసిన భార్య మురుగన్‌ను నిలదీసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న మురుగన్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన భార్యతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. నగరంలోని పీకే లేఅవుట్‌లోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా బెల్టుతో భార్య మెడ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం లాడ్జి నుంచి పరారయ్యాడు.
 
ఉదయం గదిలో చనిపోయిన మహిళను చూసిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ కనిపించకపోవడంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని భావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments