Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు చస్తుంటే.. కోవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీనా? రాజస్థాన్ మంత్రి

Webdunia
శనివారం, 8 మే 2021 (16:51 IST)
ఒకవైపు కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా రోగుల ప్రాణాలు రక్షించే మందులపై జీఎస్టీ వసూలు చేయడం.... శవాలపై  పైసలు ఎరుకున్న చందమే అవుతుందని రాజస్థాన్‌ రాష్ట్ర మంత్రి ప్రతాప్ ఖచరియవస్ ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్-19 వ్యాక్సిన్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం పెట్రో ధ‌ర‌ల పెంపుపై మోడీ స‌ర్కార్ కరోనా కష్టకాలంలోనూ వెనక్కి తగ్గడం లేదన్నారు.
 
దేశంలో పౌరులంద‌రికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉచిత వ్యాక్సిన్ పొంద‌డం పౌరుల హ‌క్క‌ని.. దీనిపై ఎలాంటి చ‌ర్చ లేకుండా స‌త్వ‌ర‌మే పౌరులంద‌రికీ ఉచిత వ్యాక్సినేష‌న్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.
 
కొవిడ్ వ్యాక్సిన్ల‌పై ప‌న్నుల భారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌నంగా రూ.3000 కోట్లు వెచ్చించాల్సి ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఆక్సిజన్ కొర‌త‌తో ప్రాణాలు విడుస్తుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను త‌న గుప్పిట్లోకి తీసుకుంద‌ని విమ‌ర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments