భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఇనుప గొలుసుతో కట్టేసిన భర్త..

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (08:26 IST)
ఇటీవలి కాలంలో అనుమానపు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ అనుమానపు మొగుడు... తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని గట్టిగా నమ్మి.. ఆమెను ఇనుప గొలుసుతో కట్టేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ జిల్లాలోని లాల్‌ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి బాధిత మహిళను గొలుసును తెంపి కాపాడారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు తాను పుట్టింటికి వస్తే భర్త వచ్చి తనను దారుణంగా కొట్టి, ఇంటికి తీసుకువచ్చి ఇనుపగొలుసులతో బంధించి రెండు తాళాలు వేసి వెళ్లాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాను తన తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు వస్తే తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి తన భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను కాపాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన భర్తను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments