Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ సరిహద్దులు బంద్

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (21:50 IST)
వారం రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్‌లు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.

రాజస్తాన్‌కు యుపి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం నుండి వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కచ్చితంగా పాస్‌లు ఉండాల్సిందేనని డిజిపి తెలిపారు. సంబంధిత పాస్‌లను కలెక్టర్లు, ఎస్‌పిల నుండి తీసుకోవాలని అన్నారు.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌లు (ఎన్‌ఒసి) ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని నిర్నయించినట్లు ఆయన వివరించారు.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లలో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాజస్తాన్‌లో బుధవారం తాజాగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,300కి చేరగా, 256 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments