Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటాలో రాలిపోతున్న విద్యాకుసుమాలు .. మరో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (10:46 IST)
వివిధ రకాలైన పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచిన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థితో కలిసి ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత యేడాది నమోదైన మరణాలతో పోల్చుకుంటే ఈ యేడాది ఈ సంఖ్య దాటిపోయింది. ప్రతి నెలా ఒకరు లేదా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గతం వారం రోజుల్లో ఇది మూడో ఘటన కావడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజాంగఢ్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ల మనీశ్ ప్రజాపత్ అనే యువకుడు కోటాలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటరులో గత ఆరు నెలలుగా జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ విద్యార్థి గురువారం ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతని గదిలో ఎలాంటి సూసైడ్ లేఖ కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ తాజాగా ఆత్మహత్యతో కలుపుకుంటే ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఒత్తిడేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గత యేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా, ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది తనువులు చాలించడం తీవ్ర విషాదానికి గురి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments