Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (13:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన వితంతువు ఓ హోటల్‌లో కిచెన్‌లో పాచిపని చేస్తూ వస్తోంది. అదే హోటల్‌లో పని చేస్తున్న సురేశ్ సాహు(24) అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడి, అది మరింత సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించి, కేకలు వేసింది. ఈ కేకలు ఆలకించి ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకుని సాహును బెదిరించి తరిమిగొట్టారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం