Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పజిల్‌ను పరిష్కరించేది ఎలా? రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 4 మే 2020 (11:54 IST)
కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే శాఖ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీలను తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైల్వే శాఖ ముందుకు వచ్చి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణించే వలస కూలీల నుంచి రైల్వే శాఖ చార్జీలు వసూలు చేస్తోంది. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. వలస కూలీల నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 
 
'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఇపుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments