Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పజిల్‌ను పరిష్కరించేది ఎలా? రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 4 మే 2020 (11:54 IST)
కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే శాఖ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీలను తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైల్వే శాఖ ముందుకు వచ్చి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణించే వలస కూలీల నుంచి రైల్వే శాఖ చార్జీలు వసూలు చేస్తోంది. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. వలస కూలీల నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 
 
'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఇపుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments