Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధేమా! 'ఐ లవ్ యూ' అంటూ ప్రలోభాలకు గురిచేసింది : వీహెచ్‌పీ నేత

వివాదాస్పద మాత రాథేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్‌పై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) సభ్యుడు సురేందర్ మిట్టల్‌ సంచలన ఆరోపణలు చేశారు. దైవాంశ సంభూతురాలిగా చెప్పుకునే రాథేమా.. ప్రేమ పేరిట తనను తీవ్రంగా వేధిం

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (16:00 IST)
వివాదాస్పద మాత రాథేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్‌పై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) సభ్యుడు సురేందర్ మిట్టల్‌ సంచలన ఆరోపణలు చేశారు. దైవాంశ సంభూతురాలిగా చెప్పుకునే రాథేమా.. ప్రేమ పేరిట తనను తీవ్రంగా వేధించిందని ఆరోపించారు. ‘ఐ లవ్ యూ’ అంటూ రకరకాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించేదనీ... తీరా ఆమె ముందుకు వెళితే నానా శాపనార్థాలు పెట్టేదని సురేందర్ పేర్కొన్నాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "ఇది రెండేళ్లనాటి మాట. మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారం అయింది. ఆమెకు నా తరపు న్యాయవాది నోటీసు కూడా జారీచేశారు. ఇప్పుడు ఆమెపై కోర్టు ధిక్కార నోటీసులు కూడా ఫైల్ చేశాం. హైకోర్టు ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి బాబాలు, స్వామీజీల పేరిట నకిలీ గుర్తింపుతో దందాలు నడుపుతున్న వాళ్లను వెలుగులోకి తీసుకురావాలి.." అని మిట్టల్ పేర్కొన్నాడు.
 
రాథేమాపై పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు గత మూడు రోజుల క్రితం కొరడా ఝళింపించిన సంగతి తెలిసిందే. సురేందర్ మిట్టల్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను మంగళవారం హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆమె వ్యవహారం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే డేరాబాబా గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో వివాదాస్పద మాత రాథేమా వ్యవహారంపై ఆరోపణలు రావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments