Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... ఆపై హత్య చేసి మృతదేహం దగ్దం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:42 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. పిమ్మట మృతదేహాన్ని దగ్ధంచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట 15 యేళ్ళ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పిమ్మట మృతదేహాన్ని దగ్ధం చేశారు. 
 
ఈ క్రమంలో చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన మృతదేహం ఒకటి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఇదిలావుంటే, సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments