Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు : అమెరికా వార్నింగ్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (09:27 IST)
ఈస్టర్ సండే రోజున జరిగిన ఎనిమిది వరుస పేలుళ్ళలో శ్రీలంక రాజధాని కొలంబో దద్ధరిల్లిపోయింది. ఐసిస్ తీవ్రవాద సంస్థ మానవబాంబులతో మారణహోమం సృష్టించింది. ఈ దాడులో దాదాపు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వారంలో కూడా శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల ఉగ్రదాడులపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకను హెచ్చరించింది. ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వ తేదీ ఆదివారంలోపు కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్‌లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది.
 
దీంతో శ్రీలంక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments