Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు : అమెరికా వార్నింగ్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (09:27 IST)
ఈస్టర్ సండే రోజున జరిగిన ఎనిమిది వరుస పేలుళ్ళలో శ్రీలంక రాజధాని కొలంబో దద్ధరిల్లిపోయింది. ఐసిస్ తీవ్రవాద సంస్థ మానవబాంబులతో మారణహోమం సృష్టించింది. ఈ దాడులో దాదాపు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వారంలో కూడా శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల ఉగ్రదాడులపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకను హెచ్చరించింది. ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వ తేదీ ఆదివారంలోపు కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్‌లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది.
 
దీంతో శ్రీలంక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments