Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌ను ఊడ్చేసిన "చీపురు" - వెనుకంజలో అమరీందర్, చన్నీ, సిద్ధూ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (11:50 IST)
పంజాబ్ రాష్ట్రాన్ని చీపురు ఊడ్చేసింది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి గత నెలలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు బుధవారం జరిగింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళుతోంది. 
 
మొత్తం 117 అసెంబ్లీ సీట్లకుగాను ఆప్ పార్టీ 89 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ 15, శిరోమణి అకాలీదళ 8, బీజేపీ 4, ఇతరులు ఒక చోట అధికారంలో ఉన్నారు. 
 
అయితే ఈ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన అమరీందర్ సింగ్, ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధూలు వెనుకంజలో ఉన్నారు. అకాలీదళ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ లంబీ స్థానం నుంచి పోటీ చేసి వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి గుర్మీత్ సింగ్ కుదియాన్ ఆధిక్యంలో ఉన్నారు. 
 
పంజాప్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఇక అమృతసర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సాద్ నేత బిక్రమ్ మజితా కూడా వెనుకంజలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments