Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని ఆరుగురితో రేప్ చేయించిన ప్రియుడు.. ఎక్కడ?

ప్రేమ పేరుతో నమ్మించి ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఆరుగురు స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ దారుణం పుదుచ్చేరిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 19 జులై 2018 (17:23 IST)
ప్రేమ పేరుతో నమ్మించి ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఆరుగురు స్నేహితులతో కలిసి రేప్ చేశాడు. ఈ దారుణం పుదుచ్చేరిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా వళుదావూర్‌కు చెందిన 17 యేళ్ళ బాలికకు స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సినిమాలకు షికార్లకు తిప్పాడు. దీంతో ఆ బాలిక అతన్ని గుడ్డిగా నమ్మేసింది.
 
ఈ నేపథ్యంలో సినిమా పేరుతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన ఆరుగురు స్నేహితులను పిలిపించి అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని చూపించి భయపెట్టి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. 
 
ఆమె నిస్సహాయతను ఆసరా చేసుకొని తన ఆరుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు. బాధితురాలు వారి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments