Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరుతో వ్యభిచార దందా.. విటులతో ముగ్గురమ్మాయిలు...

దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజ

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (13:50 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో ముగ్గురమ్మాయిలతో విటులు ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరులోని ఇందిరానగర్‌లోని 13జి మెయిన్ వాణిజ్య భవనంలో వరలక్ష్మీ (45) అనే మహిళ స్పా పేరిట ఓ మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. తమ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులకు మసాజ్ చేసేందుకు పలువురు అందమైన అమ్మాయిలను నియమించింది. 
 
ఈ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులు కోరిక మేరకు వారికి అమ్మాయిలను సరఫరా చేస్తుంది. స్పాలో సెక్స్ రాకెట్ సాగుతుందని అందిన సమాచారంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా ముగ్గురు అమ్మాయిలు, విటులు చిక్కారు. 
 
ఈ అమ్మాయిల్లో బెంగళూరుకు చెందిన ఓ యువతితోపాటు నాగాలాండ్, అసోంకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. వీరిని ప్రభుత్వ మహిళా సదనానికి తరలించారు. వారి నుంచి 3,500 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, విటుల ఫోన్ నంబర్ల జాబితాలు దొరికాయి. పోలీసులు స్పా నిర్వాహకురాలైన వరలక్ష్మీతో పాటు.. పలువురు ఖాతాదారులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం