Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వమన్నాడు.. జైలుకెళ్లాడు

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అర

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (11:43 IST)
ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధిత విద్యార్థిని జూనియర్ కాలేజీలో కామర్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలని ప్రొఫెసర్ డిమాండ్ చేశాడు. తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ అడగడంతో ప్రొఫెసర్ సంగతిని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు ఈ కేసులో నిందిత ప్రొఫెసర్‌పై సత్వర చర్యను తీసుకునే విధంగా మద్దతు కోసం వారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఫలితంగా నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments