ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ చిత్తుగా ఓటమి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అంతా తానే నడుచుకున్నారు. ఎన్నికలకు ముందునుంచే ఆమె అక్కడ తిష్టవేసి అతిపెద్ద రాష్ట్రాన్ని చుట్టేశారు. కానీ, గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ప్రియాంకా చేసిన ప్రచారానికి ఏమాత్రం ఓట్లు పడలేదు. దీంతో ఎన్నికల్లో ప్రియాంకా ప్రభావం అంతంతమాత్రమేనని తేలిపోయింది. 
 
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 263 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 135 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, కేవలం 2 చోట్ల, బీఎస్పీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రియాంకా గాంధీ ప్రచారం ఏమాత్రం పని చేయలేదని తేలిపోయింది. 
 
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. మరోవైపు, ఎస్పీ మాత్రం కాస్త పుంజుకుందనే చెప్పాలి. అదేసమయంలో బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ సీట్లు మాత్రం 15కి పైగా తగ్గాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 280 సీట్లలో గెలుపొందగా ఇపుడు 263కే పరిమితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments