Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ చిత్తుగా ఓటమి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అంతా తానే నడుచుకున్నారు. ఎన్నికలకు ముందునుంచే ఆమె అక్కడ తిష్టవేసి అతిపెద్ద రాష్ట్రాన్ని చుట్టేశారు. కానీ, గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ప్రియాంకా చేసిన ప్రచారానికి ఏమాత్రం ఓట్లు పడలేదు. దీంతో ఎన్నికల్లో ప్రియాంకా ప్రభావం అంతంతమాత్రమేనని తేలిపోయింది. 
 
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 263 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 135 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, కేవలం 2 చోట్ల, బీఎస్పీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రియాంకా గాంధీ ప్రచారం ఏమాత్రం పని చేయలేదని తేలిపోయింది. 
 
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. మరోవైపు, ఎస్పీ మాత్రం కాస్త పుంజుకుందనే చెప్పాలి. అదేసమయంలో బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ సీట్లు మాత్రం 15కి పైగా తగ్గాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 280 సీట్లలో గెలుపొందగా ఇపుడు 263కే పరిమితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments