Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ చిత్తుగా ఓటమి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అంతా తానే నడుచుకున్నారు. ఎన్నికలకు ముందునుంచే ఆమె అక్కడ తిష్టవేసి అతిపెద్ద రాష్ట్రాన్ని చుట్టేశారు. కానీ, గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ప్రియాంకా చేసిన ప్రచారానికి ఏమాత్రం ఓట్లు పడలేదు. దీంతో ఎన్నికల్లో ప్రియాంకా ప్రభావం అంతంతమాత్రమేనని తేలిపోయింది. 
 
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 263 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 135 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, కేవలం 2 చోట్ల, బీఎస్పీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రియాంకా గాంధీ ప్రచారం ఏమాత్రం పని చేయలేదని తేలిపోయింది. 
 
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. మరోవైపు, ఎస్పీ మాత్రం కాస్త పుంజుకుందనే చెప్పాలి. అదేసమయంలో బీజేపీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ సీట్లు మాత్రం 15కి పైగా తగ్గాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 280 సీట్లలో గెలుపొందగా ఇపుడు 263కే పరిమితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments