Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేస్తే లండన్‌కు వెళ్లిపోతాం.. ప్రియాంక దేవదూత : నళిని

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (09:33 IST)
తన భర్త మురుగన్‌ను విడిచిపెడితే లండన్‌కు వెళ్లిపోతామని రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని ప్రాధేయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హంతకులందరినీ తమిళనాడు ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, నళిని భర్త మురుగన్‌ను తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరానికి తరలించారు. దీనిపై నళిని మాట్లాడుతూ, తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో మురుగన్‌ను ఉంచారని దాన్ని ప్రత్యేక జైలుగా మార్చనున్నట్టు తెలిపారని ఆవేదన వ్యక్తం చేసింది. లండన్‌లో తమ కుమార్తె హరిత తమ కోసం ఎదురు చూస్తుందని చెప్పింది. తన భర్తను ప్రభుత్వం విడుదల చేస్తే లండన్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు వెళ్లిపోతామని తెలిపింది. 
 
జైలు జీవితం తమకు ఎన్నో అనుభవాలను నేర్పిందన్నారు. బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం పట్ల చాలా బాధపడుతున్నామని, తమకు క్షమాభిక్ష ప్రసాదించిన సోనియా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మనసు అంగీకరించడం లేదని చెప్పింది. 
 
2008లో ప్రియాంకా గాంధీ తమను జైలులో కలిసినపుడు తండ్రి హత్య గురించి ప్రశ్నించారని, అపుడు భావోద్వేగానికి గురై బోరున ఏడ్చానని తెలిపింది. ప్రియాంకా గాంధీ ఒక దేవదూత అని చెప్పుకొచ్చింది. అయితే, తాము అమాయకులమనే విషయం కాలమే నిర్ణయిస్తుందని నళిని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments