Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేస్తే లండన్‌కు వెళ్లిపోతాం.. ప్రియాంక దేవదూత : నళిని

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (09:33 IST)
తన భర్త మురుగన్‌ను విడిచిపెడితే లండన్‌కు వెళ్లిపోతామని రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని ప్రాధేయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హంతకులందరినీ తమిళనాడు ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, నళిని భర్త మురుగన్‌ను తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరానికి తరలించారు. దీనిపై నళిని మాట్లాడుతూ, తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో మురుగన్‌ను ఉంచారని దాన్ని ప్రత్యేక జైలుగా మార్చనున్నట్టు తెలిపారని ఆవేదన వ్యక్తం చేసింది. లండన్‌లో తమ కుమార్తె హరిత తమ కోసం ఎదురు చూస్తుందని చెప్పింది. తన భర్తను ప్రభుత్వం విడుదల చేస్తే లండన్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు వెళ్లిపోతామని తెలిపింది. 
 
జైలు జీవితం తమకు ఎన్నో అనుభవాలను నేర్పిందన్నారు. బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం పట్ల చాలా బాధపడుతున్నామని, తమకు క్షమాభిక్ష ప్రసాదించిన సోనియా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మనసు అంగీకరించడం లేదని చెప్పింది. 
 
2008లో ప్రియాంకా గాంధీ తమను జైలులో కలిసినపుడు తండ్రి హత్య గురించి ప్రశ్నించారని, అపుడు భావోద్వేగానికి గురై బోరున ఏడ్చానని తెలిపింది. ప్రియాంకా గాంధీ ఒక దేవదూత అని చెప్పుకొచ్చింది. అయితే, తాము అమాయకులమనే విషయం కాలమే నిర్ణయిస్తుందని నళిని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments